ఖతార్:వర్కింగ్ అవర్స్ నిబంధనల ఉల్లంఘన..33 వర్క్ సైట్లు తాత్కాలికంగా మూసివేత
- July 19, 2020
దోహా:వేసవిలో కార్మికుల పని వేళలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై వేటు పడింది. ఈ నెల 15, 16న నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 33 వర్క్ సైట్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వేసవిలో కార్మికులు వేడి తాపానికి గురవకుండా వారి ఆరోగ్య సంరక్షణ కోసం కార్మిక, సాంఘిక మంత్రిత్వ శాఖ...మినిస్టిరియల్ డిసిషన్ నెంబర్ 16, 2007ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు కార్మికులకు విశ్రాంతి కల్పించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులు విశ్రాంతి తీసుకునే సమయంలో చల్లదనం కోసం ఏసీలు ఏర్పాటు చేయాలి, చల్లని నీరు అందించాలి, తేలికపాటి దుస్తులను కార్మికులు ఇవ్వాల్సి ఉంటుంది. నేరుగా ఎండ తగిలే ప్రాంతాల్లో పని పురమాయించొద్దు. కానీ, కొన్ని కంపెనీలు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు పట్టించుకోకుండా నిబంధనల ఉల్లంఘనకు పాల్పిడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ రంగంలో ఉన్న కంపెనీలు కార్మికుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశాయి. ఈ నెల 15, 16 నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన 33 వర్క్ సైట్లలో పనులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇదిలాఉంటే జూన్ 15 నుంచి జులై 16 మధ్యకాలంలో పలు ప్రాంతాల్లోని 173 వర్క్ సైట్లను మూసివేశారు.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!