తెలంగాణలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు
- July 20, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,274 చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 7 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 422 కు చేరింది. తాజాగా 1885 మంది కరోనా రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 34,323 కు చేరింది. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 74 శాతంగా ఉండటం శుభ పరిణామం. రాష్ట్రంలో ప్రస్తుతం 11,530 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 510 కేసులు, రంగారెడ్డి 106, కరీంనగర్ 87, మేడ్చల్ 76, వరంగల్ అర్బన్ 73, మహబూబ్ నగర్ జిల్లాల్లో 50 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







