చీటింగ్ ఫిర్యాదులపై కంపెనీపై ప్రశ్నలు
- July 21, 2020
బహ్రెయిన్: ఉమ్ అల్ హసామ్ ప్రాంతంలోని ఓ కంపెనీపై చీటింగ్ ఆరోపణలు నేపథ్యంలో అథారిటీస్ పై ప్రశ్నలు కురిపించడం జరిగింది. జాబ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేసే ఆ కంపెనీపై ఓ ప్రముఖ సోషల్ వర్కర్ స్పందిస్తూ, నేపాల్, బంగ్లాదేశ్, ఉగాండా అలాగే ఆఫ్రికాలోని మరికొన్ని ప్రాంతాలకు చెందిన వలసదారుల్ని సదరు కంపెనీ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్నట్లు అభియోగాలు వచ్చినట్లు చెప్పారు. ఆ సోషల్ వర్కర్, ఎంపీ అమ్మార్ అల్ బన్నాయ్కి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీ ఈ కేసు విషయాన్ని సంబంధిత అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా వైరస్ టెస్టింగ్ కోసం ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంస్థపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో సంస్థపై అథారిటీస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్ వర్కర్ సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?