కోవిడ్-19 తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సాయం..
- July 21, 2020
కోవిడ్ బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నిర్ణీత మొత్తంలో పరిహారం అందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంస్థలో చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మరణించారని జూలై 20 నాటి సర్క్యులర్ లో ఎయిర్ ఇండియా పేర్కొంది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబాలు, చట్టపరమైన వారసుడికి 10 లక్షల రూపాయలు, ఫిక్స్ డ్ టెర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 లక్షలు, ఏడాది పాటు నిరంతరం పనిచేసిన ఉద్యోగులకు రూ.90 వేలు అందజేస్తామని సంస్థ వివరించింది. ఒకవేళ ఉద్యోగి కాంట్రాక్టర్ ద్వారా కానీ, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కానీ నియమితులై ఉంటే రెండు నెలల స్థూల వేతనాన్ని ఇస్తామని తెలిపింది. ఈ చెల్లింపులు ఏప్రిల్ 1 2020 నుంచి మార్చి 2021 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







