ఏపీలో కొత్తగా 6 వేలకు పైగా కేసులు..

- July 22, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 6 వేలకు పైగా కేసులు..

అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో మొత్తం 49,553 శాంపిల్స్‌ ని పరీక్షించగా 6,045 మంది కోవిడ్‌ 19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. 6494 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు.కోవిడ్‌ వల్ల గుంటూరు లో పదిహేను మంది, కృష్ణ లో పది మంది, పశ్చిమ గోదావరి లో ఎనిమిది మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, చిత్తూర్‌ లో ఐదుగురు, కర్నూల్‌ లో ఐదుగురు, విజయనగరం లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కడప లో ఒకరు, నెల్లూరు లో ఒకరు మరణించారు ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14,35,827 శాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది. రాష్ట్రం లో నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను 29,390 మంది డిశ్చార్జ్ కాగా.. 823 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605 గా ఉంది.

--ఆర్.వి.ఆర్.ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com