ఫుడ్ అలాగే మందులు అవసరమైన మేర సమకూర్చుకోవాలి
- July 22, 2020
మస్కట్:ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), ఫుడ్ అలాగే కన్స్యూమర్ గూడ్స్ మరియు మెడికల్ సప్లయ్స్ సెక్టార్లు తగిన మేర నిల్వలు వుంచుకోవాలని సూచించింది. లాక్డౌన్ అలాగే ఈద్ సెలవుల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. సుల్తానేట్లోని అన్ని గవర్నరేట్స్లో నిల్వలు వుంచుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. గవర్నరేట్ల మధ్య టోటల్ లాక్డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఆదేశించారు. అయితే, అవసరానికి మించి వినియోగదారులు కొనుగోళ్ళు జరపరాదని కూడా సూచించడం జరిగింది. సుప్రీం కమిటీ - కోవిడ్ 19, జులై 25 నుంచి ఆగస్ట్ 8 వరకు టోటల్ లాక్డౌన్ అన్ని గవర్నరేట్స్లోనూ అమలవుతుందని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు