భారత్:దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగింపు

- July 24, 2020 , by Maagulf
భారత్:దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగింపు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనావైరస్ తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. ఈ సాయంత్రం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కూడా దేశీయ విమాన ఛార్జీలపై గ‌తంలో విధించిన నియంత్ర‌ణ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ నెల ప్రారంభంలో మాట్లాడుతూ దీపావళి నాటికి ప్ర‌యాణించే దేశీయ విమానాల సంఖ్య 55 నుండి 60 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశీయ విమానయాన పరిశ్రమ వివిధ రంగాలకు ఛార్జీల పరిమితితో, పరిమిత సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com