అధికంగా వాడితే ఇక్కట్లు తప్పవట!
- July 25, 2020
కరోనా వైరస్ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ రాసుకోవడం సబ్బు నీళ్లతో కడగటం ఎక్కువైంది. చివరికి వంట చేసే సమయంలో కూడా శానిటైజర్ రాసుకుంటున్నారు. అయితే శానిటైజర్తో ఎంత ప్రయోజనం వుందో.. అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు.
ఎప్పుడూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం కాబట్టి చాలా మంది శానిటైజర్లనే ఉపయోగిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్తో తయారు చేసిన శానిటైజర్ల వినియోగం ఎక్కువగా వుంది. అయితే వీటిని అధికంగా వాడటం వల్ల చేతిపై వుండే చర్మం దుష్ప్రభావాలకు గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన పొడిబారడం, మంట, చర్మం ఎర్రబడటం వంటి చర్మ సమస్యలను ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని రకాల మంచి బ్యాక్టీరియాలు దోహదం చేస్తాయి. అందువల్ల శానిటైజర్ను అవసరం మేరకే వాడాలి కానీ అదే పనిగా వాడకూడదు. వీటిని ఎక్కువగా వాడితే వైరస్, క్రిములు తమ రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరానికి, చేతులకు సహజ సిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి స్థాయి తగ్గుతుందంటున్నారు. కొందరు తుమ్మినా దగ్గినా శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదట.. చేతులు అపరిశుభ్రంగా, దుమ్ము, మట్టి అంటుకున్నప్పుడు వాడటం బెటర్ అని వైద్యులు తెలిపారు.
ఇంట్లో ఉన్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం మేలని.. సుమారు 20 సెకన్ల పాటు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల క్రిముల బారినపడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్లను వాడటం వల్ల చేతి చర్మంపై ఏమైనా మార్పులు కనిపిస్తుంటే శానిటైజర్ వాడటం మానేయడం మంచిది.
హీలింగ్ లేపనాలతో ఉన్న మాయిశ్చరైజర్లను ఉపయోగించడం వల్ల చేతి చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరే అవకాశాలు ఉంటాయి. చర్మంపై పగుళ్లు వచ్చినట్లయితే వీటిని తగ్గించేందుకు గాను రాత్రిపూట గ్లౌజులు ధరించి, ఆక్వాపోరిన్ కలిగిన మాయిశ్చరైజర్లను వాటిపై రాసుకోవచ్చంటూ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







