రస్‌ అల్ ‌ఖైమా తీరంలో నలుగురు చిన్నారుల్ని రక్షించిన మత్స్యకారుడు

- July 25, 2020 , by Maagulf
రస్‌ అల్ ‌ఖైమా తీరంలో నలుగురు చిన్నారుల్ని రక్షించిన మత్స్యకారుడు

యూఏఈ: నలుగురు ఎమిరేటీ చిన్నారుల్ని రస్‌ అల్‌ఖైమా సమీపంలోని ఓ తీరంలో మునిగిపోతుండగా మత్స్యకారుడు‌ రక్షించారు. తీరంలో మునిగిపోతున్న చిన్నారుల్ని తన బాల్కనీ నుంచి ఓ మహిళ గుర్తించడం జరిగింది. అలాగే ఓ మత్స్యకారుడు‌ కూడా వారిని చూశారు. వెంటనే, ఆ చిన్నారుల్ని మత్స్యకారుడు‌ రక్షించడం జరిగింది. ఇదే తన తొలి రెస్క్యూ మిషన్‌ అని ఫిషర్‌మెన్‌ జాసిమ్ రజాబ్‌ చెప్పారు. సమీప ప్రాంతంలో వుండడంతో తాను వారిని రక్షించగలిగినట్లు వివరించారాయన. కాగా, సకాలంలో చిన్నారుల్ని రక్షించిన ఫిషర్‌మెన్‌ని రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ అల్‌ జాబి అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com