ఏపీలో కొత్తగా 7,813 కరోనా పాజిటివ్ కేసులు

- July 25, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 7,813 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో కరోనా కల్లోలం కోనసాగుతోంది. గత 24 గంటల్లో 53,681 శాంపిల్స్ ను
పరీక్షించగా 7,813 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 3,208 మంది కోవిడ్‌ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్‌ వల్ల గుంటూరు-09, పశ్చిమ గోదావరి-08,తూర్పు గోదావరి-06, కృష్ణ-06, కర్నూల్-06,చిత్తూర్‌-05, విజయనగరం-04, శ్రీకాకుళం -03, విశాఖపట్నం-03, నెల్లూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను 40,406 మంది డిశ్చార్జ్ కాగా 985 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com