రైతు కష్టాలు చూసి చలించిపోయిన సోను సూద్...రేపటిలోగా ఎద్దులు వస్తాయి అంటూ హామీ

- July 26, 2020 , by Maagulf
రైతు కష్టాలు చూసి చలించిపోయిన సోను సూద్...రేపటిలోగా ఎద్దులు వస్తాయి అంటూ హామీ

కరోనా సంక్షోభం కారణంగా, ఒక టీ-షాపు యజమాని తన దుకాణాన్ని మూసివేసి, చిత్తూరులోని తన గ్రామమైన మదనపల్లె కు తిరిగి రావలసి వచ్చింది. లాక్డౌన్ సమయంలో వ్యాపారం లేదు కనుక వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ ఎద్దులను కొనడానికి, కార్మికులను నియమించుకోవడానికి డబ్బు లేకపోవటంతో అతను తన కుమార్తెలను పొలంలో దున్నుటకు కాడెద్దులుగా మార్చాడు. ఇద్దరు బిడ్డలు కాడి పట్టుకు నడుస్తుంటే వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వెళ్లారు. ఈ వీడియో చూసి చలించిపోయిన సోనూ.."రేపు ఉదయానికల్లా ఆ రైతుకు రెండు ఎద్దులు వస్తాయని ముందు ట్వీట్ చేసారు కాని ఇవాళ సాయంత్రంమే ట్రాక్టర్ పంపించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com