దుబాయ్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 26, 2020
దుబాయ్:ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ రాష్ట్రం,ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి (38) అనే యువకుడు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందాడని సోషల్ వర్కర్ జైత నారాయణ మా గల్ఫ్ కు తెలియజేసారు.గత కొన్ని సంవత్సరాల క్రితం ధర్మపురిలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించిన రవి కొన్ని సంవత్సరాల క్రితం ఉపాదివేటలో దుబాయ్ వెళ్ళాడు.
అక్కడ పనిచేస్తున్న రవి ఉదయం వేళలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.యువకుడి మరణ వార్తతో కుటుంబంతోపాటు బంధువర్గం దుఃఖంలో మునిపోయారు.మృతదేహాన్ని స్వస్థలానికి పంపటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







