దుబాయ్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి

- July 26, 2020 , by Maagulf
దుబాయ్ లో  గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి

దుబాయ్:ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ రాష్ట్రం,ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి (38) అనే యువకుడు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందాడని సోషల్ వర్కర్ జైత నారాయణ మా గల్ఫ్ కు తెలియజేసారు.గత కొన్ని సంవత్సరాల క్రితం ధర్మపురిలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించిన రవి కొన్ని సంవత్సరాల క్రితం ఉపాదివేటలో దుబాయ్ వెళ్ళాడు.

అక్కడ పనిచేస్తున్న రవి ఉదయం వేళలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.యువకుడి మరణ వార్తతో కుటుంబంతోపాటు బంధువర్గం దుఃఖంలో మునిపోయారు.మృతదేహాన్ని స్వస్థలానికి పంపటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com