పెరుగుతున్న బంగారం ధరలు..
- July 26, 2020
కరోనా కాలంలోనూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లో రోజుకో రికార్డును నమోదు చేస్తున్నాయి. మున్ముందు ఇంకా పెరగడమే కాని తగ్గే ఛాన్స్ లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1900 డాలర్లకు ఎగబాకింది. వెండి కూడ అదే స్థాయిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఔన్స్ వెండి 23 డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాది నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు 2,500 డాలర్లకు చేరుకోవచ్చని పుణెకు చెందిన జువెలరీ బ్రాండ్ పీఎన్ గాడ్గిల్ ఎండి, సీఈఓ సౌరభ్ గాడ్గిల్ అన్నారు. భారత్ లో స్వచ్ఛమైన మేలిమి బంగారం 50 వేల దాటింది. హైదరాబాద్ మార్కెట్లో 24 గ్రాముల పసిడి ధర రూ.53,470కి చేరుకుంది. కేజీ వెండి రూ.61,200 పలికింది. వచ్చే 12 నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,000, కేజీ వెండి ధర రూ. 74,000 దాటవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







