వేసవి కాలంలో చలవ చేసే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
- July 27, 2020
వేసవి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోతే.. ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా శరీరానికి వేడి చేసే ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. ఎండలు మండుతున్న సమయంలో శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండాలంటే.. తప్పకుండా చలవ చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మరి ఆ ఆహారపదార్థాలేమిటో చూద్దామా!
పుచ్చకాయ: వేసవిలో అందుబాటులో ఉండే పుచ్చకాయను అస్సలు మిస్ కావద్దు. ఇందులో 91.45 శాతం నీరే ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన నీరు చేరుతుంది. అంతేగాక పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సైడులు కూడా శరీరానికి అందుతాయి. మీ శరీరాన్ని ఎప్పుడూ కూల్గా ఉంచుతాయి.
కీర దోసకాయ: ఈ కాయ కొంచెం వగరుగా ఉన్నా.. శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది. వేసవిలో కీర దోసకాయ తింటే అనారోగ్యం దరిచేరదు. పుచ్చకాయ తరహాలోనే కీరదోస కాయాలో కూడా నీటి శాతం ఎక్కువే. అలాగే, ఈ వేసవిలో నిమ్మ రసం తాగడం అస్సలు మరిచిపోకండి. వేసవిలో నిమ్మరసం మీకు బోలెడంత శక్తి ఇస్తుంది.
పెరుగు: వేసవిలో తప్పకుండా పెరుగు తప్పకుండా తినాలి లేదా మజ్జిగా చేసుకుని తాగాలి. ఇది శరీరాన్ని ఎల్లప్పుడు చల్లగా ఉంచుతుంది. మీకు మధుమేహం సమస్యలు లేనట్లయితే చల్లని లస్సీ చేసుకుని తాగండి. కీర దోసకాయ, ఉల్లిపాయలతో రైతా తయారు చేసుకుని తినండి. సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే.. పెరుగు వేసి స్మూతీస్ తయారు చేసుకుని తాగండి.
కొబ్బరి నీళ్లు: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో విటమిన్లు, మినరల్స్ తదితర పోషకాలు ఉంటాయి. వేడి వాతావరణంలో మీ శరీరానికి శక్తినిచ్చే ఔషదం కొబ్బరి నీళ్లే. రోజూ కొబ్బరి నీళ్లు తాగినట్లయితే క్యాన్సర్ దరిచేరదని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు.
పుదీనా: వేసవిలో పుదీనా తినడం లేదా నీటిలో కలుపుకొని తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. పెరుగు లేదా సలాడ్లో కాసింత పుదీనా కలుపుకుని తాగితే శరీరానికి చలవ చేస్తుంది. ఉదయం టిఫిన్లలోకి పుదీనా పచ్చడి చేసుకుని తింటే ఇంకా మంచిది. పుదీనా మీ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రిఫ్రెష్ అనుభూతి కలిగిస్తుంది.
ఆకు కూరలు: పుదీనా మాత్రమే కాకుండా ఈ సమ్మర్లో ఆకు కూరలు కూడా తినండి. ఎందుకంటే, ఆకు కూరల్లో కూడా నీటి శాతం ఎక్కువ. అయితే, వీటిని బాగా ఉడికించి తినకండి. అలా చేస్తే వాటిలో ఉండే నీటి శాతం తగ్గిపోతుంది.
ఉల్లిపాయలు: ఉల్లిపాయలు కూడా శరీరానికి చలవ చేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను, ఉల్లిపాయలు చలవే. వీటిని పచ్చిగా తినండి. నేరుగా తినడం ఇష్టం లేకపోతే రైతా లేదా నిమ్మకాయ, కాస్త ఉప్పు చల్లి తినండి. మాంచి టేస్టుగా ఉంటాయి. ఉల్లిపాయ వడ దెబ్బ నుంచి రక్షిస్తుంది.
కర్బూజాలు: కర్బూజాల్లో సైతం బోలెడంత నీరు ఉంటుంది. వేసవిలో వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మిమ్మల్ని ఎప్పుడూ డీహైడ్రేడ్ కాకుండా చూస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నీళ్లు కావాలంటే నేరుగా తాగవచ్చు కదా.. ఇవే ఎందుకు తినాలని చాలామంది భావిస్తారు. సాధారణ నీటికి పండ్లలో ఉండే నీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పండ్లలో ఉండే నీటిలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







