అబుధాబిలో కేరళ దంపతుల అనుమానాస్పద మృతి
- July 26, 2020
అబుధాబి:అబుధాబిలోని ఓ ఫ్లాట్లో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్నీ మీడియా నివేదికలు తెలిపాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్థనన్ పట్టీరీ (57), మినిజ (52) దాదాపు 18 సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన పట్టీరీ ఇటీవల ఉద్యోగం కోల్పోయాడు. మినిజా చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నారు.అయితే వారు ఎలా చనిపోయారని విషయం మాత్రం ఇంకా తేలలేదు.ఈ జంట అబుధాబిలో ఒంటరిగా నివసించినట్లు కేరళ సోషల్ సెంటర్ అధ్యక్షుడు కృష్ణ కుమార్ వి.పి తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. జనార్థనన్, మినిజ చాలా మంచివారని. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదని అన్నారు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోవడంతో కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







