అబుధాబిలో కేరళ దంపతుల అనుమానాస్పద మృతి
- July 26, 2020
అబుధాబి:అబుధాబిలోని ఓ ఫ్లాట్లో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్నీ మీడియా నివేదికలు తెలిపాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్థనన్ పట్టీరీ (57), మినిజ (52) దాదాపు 18 సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన పట్టీరీ ఇటీవల ఉద్యోగం కోల్పోయాడు. మినిజా చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నారు.అయితే వారు ఎలా చనిపోయారని విషయం మాత్రం ఇంకా తేలలేదు.ఈ జంట అబుధాబిలో ఒంటరిగా నివసించినట్లు కేరళ సోషల్ సెంటర్ అధ్యక్షుడు కృష్ణ కుమార్ వి.పి తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. జనార్థనన్, మినిజ చాలా మంచివారని. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదని అన్నారు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోవడంతో కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







