అయోధ్యకు రావద్దు..ఇళ్లలోనే దీపాలు వెలిగించండి
- July 29, 2020లక్నో: ప్రస్తుత పరిస్థితుల రీత్యా అయోధ్య లో ఆగస్టు 5న జరిగే రామాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి రావాలని ఎవరూ ఆరాట పడవద్దని శ్రీరామ్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు దేశ ప్రజలను కోరింది. ఆ రోజు సాయంత్రం అందరూ ఇళ్లలోనే ఉండి దివ్వెలు వెలిగించాలని సూచించింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 1984లో రామాలయ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఆలయ నిర్మాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
'భూమి పూజ జరిగే చారిత్రక సందర్భంలో అయోధ్యలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. శ్రీరామ జన్మభూమి ట్రస్టు కూడా అలాగే కోరుకుంటోంది. అయితే, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అలా చేయడం ఏమాత్రం సాధ్యం కాదు' అని ఆ ప్రకటన పేర్కొంది. కరోనా మార్గదర్శకాల ప్రకారం పరిమితమైన ఆహ్వానితులు, భక్తులతోనే కార్యక్రమం జరుగుతుందని, సమీప భవిష్యత్తుల్లో ప్రతి ఒక్కరూ అయోధ్యను సందర్శించవచ్చని చంపత్ రాయ్ తెలిపారు. రామాలయ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రజలు ఇళ్లలోనే ఉండి దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని ట్రస్టు సూచించింది. భూమిపూజ పవిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సాయంత్రం వేళ తమతమ ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని కోరింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం