ఆఫీసును ఆస్పత్రిగా మార్చేసిన వ్యాపారవేత్త
- July 29, 2020
సూరత్ : కరోనా పాజిటివ్ బాధితుల పట్ల ఓ వ్యాపారవేత్త మానవత్వాన్ని చాటాడు. తన కార్యాలయాన్ని ఆస్పత్రిగా మార్చేశాడు. తను పడ్డ బాధ మరొకరు పడకూడదని, పేదలకు ఈ సౌకర్యం మరింత అండగా ఉంటుందని వ్యాపారవేత్త పేర్కొన్నాడు.
సూరత్కు చెందిన ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ అనే వ్యాపారవేత్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గత నెలలో సూరత్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. 20 రోజుల పాటు చికిత్స పొందినందుకు బిల్లును వేలల్లో వసూలు చేశారు. ఆయన వద్ద డబ్బు బోలేడు ఉన్నందుకు బిల్లు కట్టేశాడు. అదే సమయంలో పేదోళ్ల గురించి ఆలోచించాడు వ్యాపారవేత్త.
ఆస్పత్రి నుంచి బయటికొచ్చాక.. తన ఆఫీసును 85 పడకల ఆస్పత్రిగా మార్చేశాడు. దీంట్లో కులమతాలకు అతీతంగా పేదలకు మాత్రమే వైద్యం అందుతుందన్నాడు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చు భారీగా ఉన్నది. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాను. కరోనా మహమ్మారి నిర్మూలనలో తాను కూడా భాగస్వామిని కావాలనుకున్నానని వ్యాపారవేత్త తెలిపాడు.
తన కార్యాలయంలో మొత్తం 85 పడకలను ఏర్పాటు చేశాడు. వైద్యులు, మెడిసిన్ అంతా ప్రభుత్వం ఇస్తుంది. మిగతావన్నీ తానే భరిస్తున్నట్లు వ్యాపారవేత్త కదర్ షేక్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







