ఛార్జీల విషయంలో కీలక ప్రకటన చేసిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ
- July 29, 2020న్యూఢిల్లీ:వందే భారత్ మిషన్ 5వ దశ.. ఆగస్ట్ 1 నుంచి ప్రారంభం అవుతోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంబంధిత విమానయాన సంస్థలు విమాన టికెట్ విక్రయాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. వందే భారత్ మిషన్లో భాగంగా విమానాలను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఏజెంట్లకు ఎక్కువ ఛార్జీలు చెల్లించవద్దని సూచించింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్లో అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన ఛార్జీల వివరాలను పొందుపర్చినట్లు తెలిపింది. వెబ్సైట్లో పేరొన్న మేరకే.. ట్రావెల్ ఏజెంట్లుకు డబ్బులు చెల్లించాలని ప్రయాణికులకు స్పష్టం చేసింది. కాగా..గల్ఫ్, అమెరికా,సింగపూర్,ఫ్రాన్స్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్కు తరలించడానికి ఐదో దశ వందే భారత్ మిషన్లో భాగంగా.. ఎయిర్ ఇండియా మంగళవారం రోజు టికెట్ల బుకింగ్ను ప్రారంభించింది.భారత్ లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, బెంగళూరు,హైదరాబాద్,విజయవాడ సహా ప్రధాన నగరాల మధ్య ఆగస్టు 30 వరకు ఎయిర్ ఇండియా విమానాలను నడపనుంది.టికెట్ల ఛార్జీల వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.
http://www.airindia.in/images/pdf/VBM-FARES-FOR-WEBSITE-29-JUL-2020.pdf
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ