ఛార్జీల విషయంలో కీలక ప్రకటన చేసిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ
- July 29, 2020
న్యూఢిల్లీ:వందే భారత్ మిషన్ 5వ దశ.. ఆగస్ట్ 1 నుంచి ప్రారంభం అవుతోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంబంధిత విమానయాన సంస్థలు విమాన టికెట్ విక్రయాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. వందే భారత్ మిషన్లో భాగంగా విమానాలను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఏజెంట్లకు ఎక్కువ ఛార్జీలు చెల్లించవద్దని సూచించింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్లో అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన ఛార్జీల వివరాలను పొందుపర్చినట్లు తెలిపింది. వెబ్సైట్లో పేరొన్న మేరకే.. ట్రావెల్ ఏజెంట్లుకు డబ్బులు చెల్లించాలని ప్రయాణికులకు స్పష్టం చేసింది. కాగా..గల్ఫ్, అమెరికా,సింగపూర్,ఫ్రాన్స్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్కు తరలించడానికి ఐదో దశ వందే భారత్ మిషన్లో భాగంగా.. ఎయిర్ ఇండియా మంగళవారం రోజు టికెట్ల బుకింగ్ను ప్రారంభించింది.భారత్ లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, బెంగళూరు,హైదరాబాద్,విజయవాడ సహా ప్రధాన నగరాల మధ్య ఆగస్టు 30 వరకు ఎయిర్ ఇండియా విమానాలను నడపనుంది.టికెట్ల ఛార్జీల వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.
http://www.airindia.in/images/pdf/VBM-FARES-FOR-WEBSITE-29-JUL-2020.pdf
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?