భారత్ లో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

- July 30, 2020 , by Maagulf
భారత్ లో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. భారత దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా బారిన పడి ఒక్కరోజే 775 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com