తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన హైకోర్టు

- July 30, 2020 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ అక్రమాలపై విచారణ జరపాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కమిటీ నివేదిక ఇచ్చి 5 నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై ఎందుకంత ప్రేమ? అని కోర్టు ప్రశ్నించింది. కాంట్రాక్టర్ సురేష్ కుమార్‌ను అందరూ వెనకేసుకొస్తున్నట్టు కనిపిస్తోందని, కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్టర్ సురేష్‌కుమార్ పనితీరును పరిశీలించాలని, ఆగస్టు 17లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com