పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
- July 30, 2020
న్యూ ఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ITR దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. సెప్టెంబర్ 30లోపు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊటర కలుగనుంది.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు జూలై 31తో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించడం ఇది వరుసగా మూడో సారి కావడ గమనార్హం. సాధారణంగా ITRను మార్చి 31లోపు దాఖలు చేయాలి. అయితే దీన్ని జూన్ 30 వరకు పొడిగించారు. తర్వత జూలై 31కు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చారు.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగేలా సీబీడీటీ ట్యాక్స్ రిటర్న్స్ గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎక్స్టెండ్ చేసింది అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







