పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
- July 30, 2020
న్యూ ఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ITR దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. సెప్టెంబర్ 30లోపు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊటర కలుగనుంది.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు జూలై 31తో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించడం ఇది వరుసగా మూడో సారి కావడ గమనార్హం. సాధారణంగా ITRను మార్చి 31లోపు దాఖలు చేయాలి. అయితే దీన్ని జూన్ 30 వరకు పొడిగించారు. తర్వత జూలై 31కు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చారు.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగేలా సీబీడీటీ ట్యాక్స్ రిటర్న్స్ గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎక్స్టెండ్ చేసింది అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







