గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సింగర్ స్మిత

- July 30, 2020 , by Maagulf
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సింగర్ స్మిత

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ సారథ్యంలో హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సింగర్ స్మిత.రాబోయే తరాలకు ఆక్షిజన్ ను అందించాలంటే మనమంతా మొక్కలు నాటాలని సింగర్ స్మిత అన్నారు.ఒక్క రంగానే కాకుండా రాజకీయ , సినీ , క్రీడా ఇంకా అనేక రంగాల వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నేడు మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో మూడు మొక్కలు నాటిన సింగర్ స్మిత...అనంతరం తాను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు , సినీ రంగానికి చెందిన ఒకరికి ( కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ సితక్క , టిడిపి నాయకులు నారా లోకేష్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సినీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ) లు కూడా మొక్కలు నాటాలని సింగర్ స్మిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com