కువైట్ వెళ్లే ఇండియన్లపై నిషేధం..ఇతర దేశాల మీదుగా వెళ్తే అనుమతి
- July 31, 2020
కువైట్ సిటీ:కరోనా కారణంగా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్లు నేరుగా కువైట్ వెళ్లేందుకు అనుమతి లేదంటూనే ఇతర దేశాల మీదుగా వస్తే మాత్రం అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు కువైట్ డీజీసీఏ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఏడు దేశాలు బంగ్లాదేశ్, ఫిలిప్పెన్స్, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ నుంచి ఏ ఒక్క ప్రయాణికుడు నేరుగా కువైట్ వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే..ఆ 7 దేశాల ప్రయాణికులు కువైట్ వెళ్లాలని అనుకుంటే..ఇతర దేశాలకు(నిషేధం విధించిన 7 దేశాలు కాకుండా) వెళ్లి 14 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. అయితే..కువైట్ వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని సూచించింది. ఆగస్ట్ 1 నుంచి కువైట్ డీజీసీఏ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు