భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు
- July 31, 2020భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించినప్పటికీ వ్యాప్తి ఆగడం లేదు. రోగుల సంఖ్య గురువారం నాటికి 1.6 మిలియన్లను దాటింది. ఇప్పటివరకు 16 లక్షల 39 వేల 350 మందికి వ్యాధి సోకింది. గురువారం, రికార్డు 54 వేల 750 మందికి కరోనా సోకింది. గురువారం 783 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మరణాల సంఖ్య 35 వేల 786 కు పెరిగింది. 2 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాల్లో పూణే నగరం నిలిచింది. దాంతో అత్యధిక కరోనా మరణాలు నమోదైన నాల్గవ నగరంగా మారింది. పూణేలో ఇప్పటివరకు 2028 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ముంబై, థానే మరియు చెన్నైలలో 2 వేలకు పైగా రోగులు మరణించారు.
బెంగళూరులో గురువారం మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు 1009 మంది వైరస్ సోకినవారు ఇక్కడ మరణించారు. దారుణమైన వార్త ఏమిటంటే, భారతదేశం ఇప్పుడు మరణాల సంఖ్యలో ప్రపంచంలో 5 వ అతిపెద్ద దేశంగా ఉంది. గురువారం ఇటలీని అధిగమించి 6 నుంచి 5 వ స్థానానికి ఎగబాకింది. భారత్ లో ఇప్పటివరకు 35 వేల 786 మంది మరణించారు. ఇటలీలో మరణించిన వారి సంఖ్య 35 వేల 129 గా ఉంది. అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండవ స్థానంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ