కువైట్ వెళ్లే ఇండియన్లపై నిషేధం..ఇతర దేశాల మీదుగా వెళ్తే అనుమతి
- July 31, 2020కువైట్ సిటీ:కరోనా కారణంగా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్లు నేరుగా కువైట్ వెళ్లేందుకు అనుమతి లేదంటూనే ఇతర దేశాల మీదుగా వస్తే మాత్రం అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు కువైట్ డీజీసీఏ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఏడు దేశాలు బంగ్లాదేశ్, ఫిలిప్పెన్స్, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ నుంచి ఏ ఒక్క ప్రయాణికుడు నేరుగా కువైట్ వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే..ఆ 7 దేశాల ప్రయాణికులు కువైట్ వెళ్లాలని అనుకుంటే..ఇతర దేశాలకు(నిషేధం విధించిన 7 దేశాలు కాకుండా) వెళ్లి 14 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. అయితే..కువైట్ వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని సూచించింది. ఆగస్ట్ 1 నుంచి కువైట్ డీజీసీఏ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం