కువైట్ వెళ్లే ఇండియన్లపై నిషేధం..ఇతర దేశాల మీదుగా వెళ్తే అనుమతి
- July 31, 2020
కువైట్ సిటీ:కరోనా కారణంగా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్లు నేరుగా కువైట్ వెళ్లేందుకు అనుమతి లేదంటూనే ఇతర దేశాల మీదుగా వస్తే మాత్రం అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు కువైట్ డీజీసీఏ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఏడు దేశాలు బంగ్లాదేశ్, ఫిలిప్పెన్స్, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ నుంచి ఏ ఒక్క ప్రయాణికుడు నేరుగా కువైట్ వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే..ఆ 7 దేశాల ప్రయాణికులు కువైట్ వెళ్లాలని అనుకుంటే..ఇతర దేశాలకు(నిషేధం విధించిన 7 దేశాలు కాకుండా) వెళ్లి 14 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. అయితే..కువైట్ వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని సూచించింది. ఆగస్ట్ 1 నుంచి కువైట్ డీజీసీఏ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







