కువైట్ వెళ్లే ఇండియన్లపై నిషేధం..ఇతర దేశాల మీదుగా వెళ్తే అనుమతి
- July 31, 2020కువైట్ సిటీ:కరోనా కారణంగా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్లు నేరుగా కువైట్ వెళ్లేందుకు అనుమతి లేదంటూనే ఇతర దేశాల మీదుగా వస్తే మాత్రం అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు కువైట్ డీజీసీఏ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఏడు దేశాలు బంగ్లాదేశ్, ఫిలిప్పెన్స్, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ నుంచి ఏ ఒక్క ప్రయాణికుడు నేరుగా కువైట్ వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే..ఆ 7 దేశాల ప్రయాణికులు కువైట్ వెళ్లాలని అనుకుంటే..ఇతర దేశాలకు(నిషేధం విధించిన 7 దేశాలు కాకుండా) వెళ్లి 14 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. అయితే..కువైట్ వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని సూచించింది. ఆగస్ట్ 1 నుంచి కువైట్ డీజీసీఏ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..