తెలంగాణలో 1,989 కరోనా పాజిటివ్ కేసులు
- July 31, 2020హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. కరోనా నుంచి కోలుకుని గత 24 గంటల్లో 816 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో 586 GHMC పరిధిలో వెలుగు చూశాయి. మిగిలిన వాటిలో మేడ్చల్-207, రంగారెడ్డి-205, వరంగల్ అర్బన్-123, కరీంనగర్-116, సంగారెడ్డి-108, మెదక్-45, ఖమ్మం-41, మహబూబ్నగర్- 61, నల్గొండ-36, మంచిర్యాల-35, గద్వాల-32, నాగర్ కర్నూలు-30, వరంగల్ గ్రామీణ జిల్లా-30, భద్రాద్రి కొత్తగూడెం-29, ములుగు-27, పెద్దపల్లి-26, సిరిసిల్ల-23, జనగామ-21, సిద్ధిపేట జిల్లా-20 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం