ఏ.పి:బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

- July 31, 2020 , by Maagulf
ఏ.పి:బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

అమరావతి:బక్రీద్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్  ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం సోదరులందరికీ  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం మరియు పేదల పట్ల కరుణను సూచిస్తుంది. ఇతరుల పట్ల సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు దానధర్మాలు, సద్భావనలతో ఆచరిస్తారు."

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com