మస్కట్:ఈద్ పేరుతో సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తే భారీ జరిమానాలు
- July 31, 2020
మస్కట్:ఈద్ సందర్భంగా ఎవరైనా ఒకే చోట గుమికూడితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఈద్ ను పురస్కరించుకొని ఎవరూ ఇతరులకు అహ్వానాలు పంపించొద్దని, అహ్వానాలు అందినా..ఎవరూ వెళ్లకూడదని కూడా పోలీసులు సూచించారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఒకే దగ్గర గుమికూడితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందన్నారు. సామూహిక కార్యక్రమాలకు హజరైన ఒక్కో వ్యక్తిపై 1500 ఒమనీ రియాల్స్ ఫైన్ విధిస్తామన్నారు. ఎంతమంది వ్యక్తులు ఉంటే అన్ని 1500 ఒమనీ రియాల్స్ ను అహ్వానించిన వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. ఇక హజరైన వ్యక్తిపై విడిగా మరో 1000 ఓమనీ రియాల్స్ ఫైన్ విధిస్తామని రాయల్ ఒమనీ పోలీసులు హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!