యూఏఈకి తిరుగు ప్రయాణంలో షరతులు..పాస్ పోర్టులో వీసా స్టాంప్ తప్పనిసరి
- August 01, 2020
యూఏఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ తిరుగు ప్రయాణం అయ్యే ప్రవాసీయుల విషయంలో ఆ దేశ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. నివాస అనుమతులు ఉన్నవారు తప్పనిసరిగా తమ రెసిడెన్సీ పర్మిట్ కు సంబంధించి పాస్ పోర్టులో స్టాంప్ చేసుకోవాలని షరతు విధించారు. అలాగే ICA, GDRFA ఆమోదం ఉండాలి. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులను పునరుద్ధరించిన నేపథ్యంలో పలువురు ప్రవాస భారతీయులు డాక్యుమెంటేషన్ కు సంబంధించి ఎక్కువ సందేహాలు అడుగుతున్న నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను స్పష్టం చేసింది. పాస్ పోర్టులో రెసిడెన్సీ పర్మిట్ స్టాంప్ వేయించుకోవటంతో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదం ఉన్న ల్యాబోరేటరి నుంచి తీసుకున్న కోవిడ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే యూఏఈ చేరుకోగానే క్వారంటైన్ సమ్మతిస్తూ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన