యూఏఈకి తిరుగు ప్రయాణంలో షరతులు..పాస్ పోర్టులో వీసా స్టాంప్ తప్పనిసరి

- August 01, 2020 , by Maagulf
యూఏఈకి తిరుగు ప్రయాణంలో షరతులు..పాస్ పోర్టులో వీసా స్టాంప్ తప్పనిసరి

యూఏఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ తిరుగు ప్రయాణం అయ్యే ప్రవాసీయుల విషయంలో ఆ దేశ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. నివాస అనుమతులు ఉన్నవారు తప్పనిసరిగా తమ రెసిడెన్సీ పర్మిట్ కు సంబంధించి పాస్ పోర్టులో స్టాంప్ చేసుకోవాలని షరతు విధించారు. అలాగే ICA, GDRFA ఆమోదం ఉండాలి. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులను పునరుద్ధరించిన నేపథ్యంలో పలువురు ప్రవాస భారతీయులు డాక్యుమెంటేషన్ కు సంబంధించి ఎక్కువ సందేహాలు అడుగుతున్న నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను స్పష్టం చేసింది. పాస్ పోర్టులో రెసిడెన్సీ పర్మిట్ స్టాంప్ వేయించుకోవటంతో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదం ఉన్న ల్యాబోరేటరి నుంచి తీసుకున్న కోవిడ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే యూఏఈ చేరుకోగానే క్వారంటైన్ సమ్మతిస్తూ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com