యూఏఈకి తిరుగు ప్రయాణంలో షరతులు..పాస్ పోర్టులో వీసా స్టాంప్ తప్పనిసరి
- August 01, 2020
యూఏఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ తిరుగు ప్రయాణం అయ్యే ప్రవాసీయుల విషయంలో ఆ దేశ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. నివాస అనుమతులు ఉన్నవారు తప్పనిసరిగా తమ రెసిడెన్సీ పర్మిట్ కు సంబంధించి పాస్ పోర్టులో స్టాంప్ చేసుకోవాలని షరతు విధించారు. అలాగే ICA, GDRFA ఆమోదం ఉండాలి. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులను పునరుద్ధరించిన నేపథ్యంలో పలువురు ప్రవాస భారతీయులు డాక్యుమెంటేషన్ కు సంబంధించి ఎక్కువ సందేహాలు అడుగుతున్న నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను స్పష్టం చేసింది. పాస్ పోర్టులో రెసిడెన్సీ పర్మిట్ స్టాంప్ వేయించుకోవటంతో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదం ఉన్న ల్యాబోరేటరి నుంచి తీసుకున్న కోవిడ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే యూఏఈ చేరుకోగానే క్వారంటైన్ సమ్మతిస్తూ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







