భారత్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
- August 01, 2020
భారత దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,000కు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 57,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 50,000కి పైగా కరోనా కేసులు నమోదవడం వరుసగా ఇది నాలుగవ రోజు. శుక్రవారం కరోనా కారణంగా 766 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక కరోనా కేసులు జూన్ నెలతో పోలిస్తే జూలైలో 2.8 శాతం అత్యధికంగా నమోదయ్యాయి. జూన్ నెలలో సుమారు 4 లక్షల కేసులు ఉన్నాయి. కాగా జూలైలో కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య జూన్ కంటే 1.6 రెట్లు అధికంగా ఉంది. జూలై నెలలో 11.1 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19,122 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 16,96,780 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 36,551 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు