తెలంగాణలో ఒక్క రోజులో 2 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
- August 01, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడచిన 24 గంటల్లో తొలిసారి ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 530కి చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో GHMC-578, రంగారెడ్డి-228, మేడ్చల్- 197, వరంగల్ అర్బన్-134, సంగారెడ్డి-101 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకొని తాజాగా 1,114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 46,502 మంది కోలుకోగా, 17,754 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







