భారత్ లో ఒక్కరోజే కరోనాతో 853 మంది మృతి
- August 02, 2020
భారత దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో గత మూడు రోజులుగా ప్రతిరోజూ అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. తాజగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 54,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 11,45,630 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే కరోనా వల్ల కొత్తగా 853 మంది ప్రాణాలు కోల్పాయారు. కరోనా వైరస్ వల్ల ఒకేరోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు సంఖ్య 37,364కు చేరింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







