అబుధాబి:భారీ జాక్పాట్ గెలుచుకున్న భారతీయుడు
- August 03, 2020
అబుధాబి:యూఏఈలో ఉంటున్న ఓ పశ్చిమ బెంగాల్ వ్యక్తికి జాక్పాట్ తగిలింది. అబుధాబిలో నిర్వహించే ‘బిగ్ టిక్కెట్’ లాటరీలో ఆయన ఏకంగా 12 మిలియన్ దిర్హామ్స్ గెలచుకున్నారు. ఈ మేరకు లాటరీ విజేతను సోమవారం ప్రకటించారు. ‘బిగ్ టిక్కెట్’ తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా కూడా విజేతకు శుభాకాంక్షలు తెలిపింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపాంకర్ డే(37) దుబాయ్ లో ఆప్టోమెట్రిస్ట్ గా పనిచేస్తున్నాడు.అయన భార్య,కూతురు పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నారు.ఈ బిగ్ టిక్కెట్ మిలయనీర్ డ్రాను సోమవారం అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తీశారు. 2018 నుంచి బిగ్టికెట్ ర్యాఫిల్లో 11 మంది స్నేహితులం కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని, ఎప్పుడో ఒకసారి తాము లాటరీ గెలిచి తీరుతామని నమ్మేవాళ్లమని దీపాంకర్ డే అన్నాడు. అది ఈ రోజు నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గెలిచిన ఈ భారీ మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామన్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







