అబుధాబి:భారీ జాక్పాట్ గెలుచుకున్న భారతీయుడు
- August 03, 2020
అబుధాబి:యూఏఈలో ఉంటున్న ఓ పశ్చిమ బెంగాల్ వ్యక్తికి జాక్పాట్ తగిలింది. అబుధాబిలో నిర్వహించే ‘బిగ్ టిక్కెట్’ లాటరీలో ఆయన ఏకంగా 12 మిలియన్ దిర్హామ్స్ గెలచుకున్నారు. ఈ మేరకు లాటరీ విజేతను సోమవారం ప్రకటించారు. ‘బిగ్ టిక్కెట్’ తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా కూడా విజేతకు శుభాకాంక్షలు తెలిపింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపాంకర్ డే(37) దుబాయ్ లో ఆప్టోమెట్రిస్ట్ గా పనిచేస్తున్నాడు.అయన భార్య,కూతురు పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నారు.ఈ బిగ్ టిక్కెట్ మిలయనీర్ డ్రాను సోమవారం అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తీశారు. 2018 నుంచి బిగ్టికెట్ ర్యాఫిల్లో 11 మంది స్నేహితులం కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని, ఎప్పుడో ఒకసారి తాము లాటరీ గెలిచి తీరుతామని నమ్మేవాళ్లమని దీపాంకర్ డే అన్నాడు. అది ఈ రోజు నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గెలిచిన ఈ భారీ మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామన్నాడు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







