ఏపీలో కరోనా విజృంభణ..
- August 03, 2020
అమరావతి:ఏ.పీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,516 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 7,822 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి.. ఇక, ఇదే సమయంలో కరోనాబారినపడిన 68 మంది మృతిచెందారు.. దీంతో.. ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కు చేరుకోగా.. 85,777 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 76,377 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1537 మందిని కరోనా బలితీసుకుంది.
గత 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది మృతిచెందగా.. విశాఖలో 9, ప్రకాశం జిల్లాలో 8, నెల్లూరు, శ్రీకాకుళంలో ఏడుగురు చొప్పున, విజయనగరంలో నలుగురు, చిత్తూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు. ఇక పాజిటివ్ కేసుల విషయానికి వస్తే.. తూర్పుగోదావరిలో 1113, విశాఖలో 1049, అనంతపురంలో 953, విజయనగరంలో 677, కర్నూలులో 602, కడపలో 576, గుంటూరులో 573, నెల్లూరులో 500 కేసులు ఇవాళ అత్యధికంగా నమోదు అయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







