వాట్సాప్ కొత్త ఫీచర్..ఫేక్న్యూస్ వ్యాప్తికి చెక్
- August 04, 2020
న్యూఢిల్లీ: కరోనా విజృంభనతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు కొద్ది రోజుల కింద వాట్సాప్ కొత్త విధానానికి తెర తీసింది. దీని ప్రకారం ఏదైనా సందేశాన్ని ఒకసారి కేవలం ఐదుగురికి మాత్రమే షేర్ చేయగలం. అయితే దీనితో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోయినప్పటికీ.. ఫేక్న్యూస్ స్వల్ప స్థాయిలో తగ్గిందని వాట్సాప్ చెప్పుకొచ్చింది.
కాగా ఇప్పుడు మరొక కొత్త ఫీచర్తో ఫేక్న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వాట్సాప్ సిద్ధమైంది. యూజర్ల చేతనే సదరు సమాచారాన్ని నిజమా, అబద్దమా కనిపెట్టించి ఎక్కువ మందికి షేర్ కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సందేశం పక్కన బ్రౌజర్ ఫీచర్ను కొత్తగా యాడ్ చేశారు. ఆ బ్రౌజర్ ఫీచర్ ద్వారా సదరు సందేశానికి సంబంధించిన వివరాలను గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఎలా పని చేస్తుందంటే..?
వాట్సాప్ కొత్త ఫీచర్ ఎక్కువ సార్లు ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను శోధించడానికి సులభమైన మార్గాన్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బ్రౌజర్ ఫీచర్ను కొత్తగా పరిచయం చేసింది. వినియోగదారులకు వచ్చిన సందేశాలకు సంబంధించిన వివరాలను ఈ బ్రౌజర్ అందిస్తుంది. ఏదేని సందేశం గురించి శోధన చేయాలనుకుంటే దాని పక్కనే ఉండే ఈ బ్రౌజర్ ఫీచర్పై క్లిక్ చేసినట్లైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు