ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న 'వీవో'
- August 04, 2020
భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగాలని (బ్రేక్ తీసుకోవాలని) చైనా కంపెనీ 'వీవో' నిర్ణయించింది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం ప్రయత్నించవలసి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ అందిన పక్షంలో.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్ క్రికెట్ సంరంభాన్ని నిర్వహించనుంది. ఇక వీవోకి వరుసగా మూడేళ్ళ పాటు ఐపీఎల్ తో కాంట్రాక్టు మిగిలి ఉంది. 2022 అంతమయ్యేలోగా వీవో ఏటా బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా ఈ చైనీస్ కంపెనీని కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా దీన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా సేనలు మన భూభాగంలోకి చొరబడుతుంటే.. చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలన్న పిలుపు ఊపందుకుంటుంటే ఈ చైనా కంపెనీకి వాటాలు తెరవడంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







