ఏ.పీ‌లో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

- August 04, 2020 , by Maagulf
ఏ.పీ‌లో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏ.పీ‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. పాజిటివ్ కేసులు నిన్న త‌గ్గినా మళ్ళీ . భారీగానే కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రోవైపు మృతుల సంఖ్య భ‌య‌పెడుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా  9,747 కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి.. ఇక‌, ఇదే స‌మ‌యంలో క‌రోనా బారిన ‌ప‌డిన 67 మంది మృతిచెందారు.. దీంతో.. ఏపీలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య  1,76,333కు చేరుకోగా.. 95,625 మంది క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్నారు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 79104 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,604 మందిని క‌రోనా బ‌లితీసుకుంది. గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా గుంటూరు జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో 9, క‌ర్నూలు జిల్లాలో 8, తూర్పు గోదావ‌రి-చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అనంత‌పురం-శ్రీ‌కాకుళం జిల్లాల్లో  ఆరుగురు చొప్పున, విశాఖ‌లో రెండు, విజ‌య‌న‌గ‌రం-ప‌శ్చిమ గోదావ‌రి-ప్ర‌కాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com