ఏ.పీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- August 04, 2020అమరావతి:ఏ.పీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. పాజిటివ్ కేసులు నిన్న తగ్గినా మళ్ళీ . భారీగానే కొత్త కేసులు నమోదు అయ్యాయి.. మరోవైపు మృతుల సంఖ్య భయపెడుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,747 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి.. ఇక, ఇదే సమయంలో కరోనా బారిన పడిన 67 మంది మృతిచెందారు.. దీంతో.. ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333కు చేరుకోగా.. 95,625 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 79104 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,604 మందిని కరోనా బలితీసుకుంది. గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 8, తూర్పు గోదావరి-చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అనంతపురం-శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో రెండు, విజయనగరం-పశ్చిమ గోదావరి-ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్