శర్వానంద్తో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి
- August 04, 2020
హైదరాబాద్:ఇటీవల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించనున్నట్లు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) ప్రకటించింది. తాజాగా, హీరో శర్వానంద్తో ఓ సినిమా నిర్మించనున్నట్లు నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు తెలిపారు.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ప్లాన్ చేస్తోంది.
శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' చిత్రంతో పాటు ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు.మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. దీని షూటింగ్ ముగింపు దశలో ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







