శ‌ర్వానంద్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి

- August 04, 2020 , by Maagulf
శ‌ర్వానంద్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి

హైదరాబాద్:ఇటీవ‌ల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించ‌నున్న‌ట్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) ప్ర‌క‌టించింది. తాజాగా, హీరో శ‌ర్వానంద్‌తో ఓ సినిమా నిర్మించ‌నున్న‌ట్లు నిర్మాతలు నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు తెలిపారు.

త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్ట‌ర్‌, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి ప్లాన్ చేస్తోంది.

శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం 'శ్రీ‌కారం' చిత్రంతో పాటు ఒక తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు.మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'ల‌వ్ స్టోరి' అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. దీని షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com