అయోధ్య రామ మందిరం: ముగిసిన భూమి పూజా కార్యక్రమం
- August 05, 2020అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం పూర్తయింది.
ప్రధాని మోదీ, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా ముఖ్య అతిథులందరూ భౌతిక దూరం పాటిస్తూ ఈ పూజలో కూర్చున్నారు.
అంతకుముందు ఆయన అయోధ్య చేరుకున్న వెంటనే స్థానికంగా ఉన్న హనుమాన్ గర్హీ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రామ జన్మభూమి స్థలానికి చేరుకుని రామ్లల్లా విగ్రహం ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత హారతి ఇచ్చి, ప్రదక్షిణం చేశారు. అక్కడ పారిజాత మొక్కను నాటారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా సరిగ్గా ముహూర్త సమయానికే పండితులు భూమి పూజ క్రతువును చేయించారు. ఈ క్రతువు ముగియగానే ప్రధాని మోదీ పునాది నుంచి కుంకుమ తీసుకొని నుదుట ధరించారు. దీంతో అక్కడే వున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్తో పాటు అతిథులు గట్టిగా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పునాది వేసిన ప్రాంతానికి శిరస్సు వంచి నమస్కరించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం