యూఏఈ, కువైట్, బహ్రెయిన్లతో బోర్డర్ని తెరిచిన సౌదీ అరేబియా
- August 05, 2020జెడ్డా: సౌదీ అరేబియా తమ ల్యాండ్ బోర్డర్లను తెరిచింది. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్లతో బోర్డర్స్ని పంచుకుంటోన్న సౌదీ అరేబియా, ల్యాండ్ బోర్డర్లను తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఎకనమిక్ యాక్టివిటీని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కింగ్డవ్ులోకి గూడ్స్ని తీసుకొచ్చే కమర్షియల్ ట్రక్కులు ల్యాండ్ పోర్టుల ద్వారా సౌదీలోకి ప్రవేశించవచ్చు. ఈ మేరకు సౌదీ కస్టమ్స్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 7న కరోనా వైరస్ నేపథ్యంలో బోర్డర్స్ని మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, సరిహద్దుల్లో కరోనా వైరస్కి సంబంధించి ప్రికాష్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదిలా వుంటే, మంగళవారం సౌదీ అరేబియాలో 1,342 కొత్త కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించారు. ఇప్పటిదాకా మొత్తం 281,435 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,954 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్