యూఏఈ, కువైట్, బహ్రెయిన్లతో బోర్డర్ని తెరిచిన సౌదీ అరేబియా
- August 05, 2020
జెడ్డా: సౌదీ అరేబియా తమ ల్యాండ్ బోర్డర్లను తెరిచింది. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్లతో బోర్డర్స్ని పంచుకుంటోన్న సౌదీ అరేబియా, ల్యాండ్ బోర్డర్లను తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఎకనమిక్ యాక్టివిటీని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కింగ్డవ్ులోకి గూడ్స్ని తీసుకొచ్చే కమర్షియల్ ట్రక్కులు ల్యాండ్ పోర్టుల ద్వారా సౌదీలోకి ప్రవేశించవచ్చు. ఈ మేరకు సౌదీ కస్టమ్స్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 7న కరోనా వైరస్ నేపథ్యంలో బోర్డర్స్ని మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, సరిహద్దుల్లో కరోనా వైరస్కి సంబంధించి ప్రికాష్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదిలా వుంటే, మంగళవారం సౌదీ అరేబియాలో 1,342 కొత్త కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించారు. ఇప్పటిదాకా మొత్తం 281,435 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,954 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







