యూఏఈ, కువైట్, బహ్రెయిన్లతో బోర్డర్ని తెరిచిన సౌదీ అరేబియా
- August 05, 2020
జెడ్డా: సౌదీ అరేబియా తమ ల్యాండ్ బోర్డర్లను తెరిచింది. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్లతో బోర్డర్స్ని పంచుకుంటోన్న సౌదీ అరేబియా, ల్యాండ్ బోర్డర్లను తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఎకనమిక్ యాక్టివిటీని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కింగ్డవ్ులోకి గూడ్స్ని తీసుకొచ్చే కమర్షియల్ ట్రక్కులు ల్యాండ్ పోర్టుల ద్వారా సౌదీలోకి ప్రవేశించవచ్చు. ఈ మేరకు సౌదీ కస్టమ్స్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 7న కరోనా వైరస్ నేపథ్యంలో బోర్డర్స్ని మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, సరిహద్దుల్లో కరోనా వైరస్కి సంబంధించి ప్రికాష్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదిలా వుంటే, మంగళవారం సౌదీ అరేబియాలో 1,342 కొత్త కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించారు. ఇప్పటిదాకా మొత్తం 281,435 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,954 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







