కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు:ఈడీ అదుపులో ముగ్గురు కీలక నిందితులు
- August 05, 2020
కేరళ: భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. వీరిని ఏడు రోజుల పాటు విచారించేందుకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కస్టడీకి వెళ్లిన వారిలో సరత్ పీఎస్, స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ ఉన్నారు. కాగా ఇదే కేసులో నిందితులను ఈ నెల 21 వరకు జ్యుడీషియన్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేపట్టారు. గత నెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ దౌత్య సంబంధిత బ్యాగులో రూ.15 కోట్ల విలువైన బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







