కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు:ఈడీ అదుపులో ముగ్గురు కీలక నిందితులు
- August 05, 2020
కేరళ: భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. వీరిని ఏడు రోజుల పాటు విచారించేందుకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కస్టడీకి వెళ్లిన వారిలో సరత్ పీఎస్, స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ ఉన్నారు. కాగా ఇదే కేసులో నిందితులను ఈ నెల 21 వరకు జ్యుడీషియన్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేపట్టారు. గత నెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ దౌత్య సంబంధిత బ్యాగులో రూ.15 కోట్ల విలువైన బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







