తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
- August 05, 2020హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి.వస్తూనే ఉన్నాయి.హైదరాబాద్ నగరం ఐటి హబ్ గా మారుతున్నది.కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నది.తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.
అంతేకాదు,రాష్ట్రంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచాలని, ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని, ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.దీంతో పాటుగా కేబినెట్ కొత్త సెక్రటేరియట్ భవనాల డిజైన్ కు ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు