తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు

- August 06, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2092 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1289 మంది పూర్తిగా కోలుకోగా .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 52,103గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల వివరాలు  GHMCలో 535, రంగారెడ్డి జిల్లాలో 169, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 128, మేడ్చల్‌ జిల్లాలో 126, కరీంనగర్‌ జిల్లాలో 123, సంగారెడ్డి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేశారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com