మస్కట్: గవర్నరేట్ల మధ్య శనివారం నుంచి లాక్ డౌన్ ఎత్తివేత
- August 06, 2020
మస్కట్:ఒమన్ లో కరోనా మహమ్మారి తీవ్రతపై సుప్రీం కమిటీ సమీక్షించింది. దేశంలో వైరస్ తీవ్రత, వ్యాప్తి తీరుపై తమకు అందిని రిపోర్ట్స్ ను పరిశీలించింది. జులై 25 నుంచి గవర్నరేట్ల మధ్య అమలులో ఉన్న లాక్ డౌన్ ను ఆగస్ట్ 8(శనివారం) వరకు కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అయితే..వ్యాప్తి నియంత్రణలో మెరుగదల కనిపించటంతో గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ ను ఎత్తివేసింది. అలాగే రాత్రి జనసంచారంపై ఉన్న నిషేధ సమయాన్ని రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించింది. ఆగస్ట్ 15 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే..వైరస్ తీవ్రత నేపథ్యంలో దోఫర్ గవర్నరేట్ పరిధిలో మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







