మస్కట్: గవర్నరేట్ల మధ్య శనివారం నుంచి లాక్ డౌన్ ఎత్తివేత
- August 06, 2020
మస్కట్:ఒమన్ లో కరోనా మహమ్మారి తీవ్రతపై సుప్రీం కమిటీ సమీక్షించింది. దేశంలో వైరస్ తీవ్రత, వ్యాప్తి తీరుపై తమకు అందిని రిపోర్ట్స్ ను పరిశీలించింది. జులై 25 నుంచి గవర్నరేట్ల మధ్య అమలులో ఉన్న లాక్ డౌన్ ను ఆగస్ట్ 8(శనివారం) వరకు కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అయితే..వ్యాప్తి నియంత్రణలో మెరుగదల కనిపించటంతో గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ ను ఎత్తివేసింది. అలాగే రాత్రి జనసంచారంపై ఉన్న నిషేధ సమయాన్ని రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించింది. ఆగస్ట్ 15 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే..వైరస్ తీవ్రత నేపథ్యంలో దోఫర్ గవర్నరేట్ పరిధిలో మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?