మస్కట్: గవర్నరేట్ల మధ్య శనివారం నుంచి లాక్ డౌన్ ఎత్తివేత
- August 06, 2020
మస్కట్:ఒమన్ లో కరోనా మహమ్మారి తీవ్రతపై సుప్రీం కమిటీ సమీక్షించింది. దేశంలో వైరస్ తీవ్రత, వ్యాప్తి తీరుపై తమకు అందిని రిపోర్ట్స్ ను పరిశీలించింది. జులై 25 నుంచి గవర్నరేట్ల మధ్య అమలులో ఉన్న లాక్ డౌన్ ను ఆగస్ట్ 8(శనివారం) వరకు కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అయితే..వ్యాప్తి నియంత్రణలో మెరుగదల కనిపించటంతో గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ ను ఎత్తివేసింది. అలాగే రాత్రి జనసంచారంపై ఉన్న నిషేధ సమయాన్ని రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించింది. ఆగస్ట్ 15 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే..వైరస్ తీవ్రత నేపథ్యంలో దోఫర్ గవర్నరేట్ పరిధిలో మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







