భారత్-కువైట్ మధ్య త్వరలో తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం
- August 06, 2020
కువైట్ సిటీ:భారత్-కువైట్ మధ్య తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఇరు దేశాల విమానయాన సంస్థలు విమాన సర్వీసుల షెడ్యూల్ పై ఓ ప్రకటన విడుదల చేసే ఛాన్సుంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత ఐదు నెలలుగా భారత్ కు రావాల్సిన వాళ్లు కువైట్ లో...కువైట్ తిరిగి వెళ్లాల్సిన వారు భారత్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక విమాన సర్వీసులను నడిసేందుకు రెండు దేశాల విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. కువైట్ నుంచి కువైట్ ఎయిర్ వేస్, జజీరా ఇండియాకు విమానాలను ఆపరేట్ చేయనుంది. కువైట్ ఎయిర్ వేస్ 300 సీట్ల కెపాసిటీతో, జజీరా 200 మంది ప్రయాణికులతో ఇండియాకు విమానాలను నడపనుంది. అదేసమయంలో భారత్ కు చెందిన ఎయిర్ లైన్స్ కూడా కువైట్ తరహాలోనే విమానాలను నడపనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







