భారత్-కువైట్ మధ్య త్వరలో తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం
- August 06, 2020
కువైట్ సిటీ:భారత్-కువైట్ మధ్య తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఇరు దేశాల విమానయాన సంస్థలు విమాన సర్వీసుల షెడ్యూల్ పై ఓ ప్రకటన విడుదల చేసే ఛాన్సుంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత ఐదు నెలలుగా భారత్ కు రావాల్సిన వాళ్లు కువైట్ లో...కువైట్ తిరిగి వెళ్లాల్సిన వారు భారత్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక విమాన సర్వీసులను నడిసేందుకు రెండు దేశాల విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. కువైట్ నుంచి కువైట్ ఎయిర్ వేస్, జజీరా ఇండియాకు విమానాలను ఆపరేట్ చేయనుంది. కువైట్ ఎయిర్ వేస్ 300 సీట్ల కెపాసిటీతో, జజీరా 200 మంది ప్రయాణికులతో ఇండియాకు విమానాలను నడపనుంది. అదేసమయంలో భారత్ కు చెందిన ఎయిర్ లైన్స్ కూడా కువైట్ తరహాలోనే విమానాలను నడపనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







