భారత్-కువైట్ మధ్య త్వరలో తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం

- August 06, 2020 , by Maagulf
భారత్-కువైట్ మధ్య త్వరలో తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం

కువైట్ సిటీ:భారత్-కువైట్ మధ్య తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఇరు దేశాల విమానయాన సంస్థలు విమాన సర్వీసుల షెడ్యూల్ పై ఓ ప్రకటన విడుదల చేసే ఛాన్సుంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత ఐదు నెలలుగా భారత్ కు రావాల్సిన వాళ్లు కువైట్ లో...కువైట్ తిరిగి వెళ్లాల్సిన వారు భారత్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక విమాన సర్వీసులను నడిసేందుకు రెండు దేశాల విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. కువైట్ నుంచి కువైట్ ఎయిర్ వేస్, జజీరా ఇండియాకు విమానాలను ఆపరేట్ చేయనుంది. కువైట్ ఎయిర్ వేస్ 300 సీట్ల కెపాసిటీతో, జజీరా 200 మంది ప్రయాణికులతో ఇండియాకు విమానాలను నడపనుంది. అదేసమయంలో భారత్ కు చెందిన ఎయిర్ లైన్స్ కూడా కువైట్ తరహాలోనే విమానాలను నడపనుంది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com