తెలంగాణ:సచివాలయం నిర్మణానికి రూ.400కోట్లు మంజూరు
- August 06, 2020హైదరాబాద్:తెలంగాణలో సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సచివాలయ నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆర్అండ్ బి శాఖా ద్వారా విడుదల చెయ్యాలని సూచించింది. ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.ఈ క్రమంలో అధికారులు చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్ని సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
కాగా కొత్తగా నిర్మించబోయే సచివాలయం ప్రతి అంతస్తులో భోజనానికి సంబంధించి డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సచివాలయ సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్,వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్