ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ప్రభాస్
- August 06, 2020హైదరాబాద్:ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు సైతం ప్రభాస్తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. కరోనా టైమ్ కాబట్టి మాస్కు ధరించే బయటకు వచ్చారు. దీంతో మాస్కులో ఉన్న ప్రభాస్తో ఫొటోలు దిగేందుకు అక్కడి జనం ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని నొప్పించడం ఇష్టం లేని డార్లింగ్ ఫొటోలకు పోజిచ్చారు. ఇదిలా వుండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. తన 21వ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జోడీగా నటించనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..